Reading Time: < 1 minute
Pithapuram Tdp Vs Janasena Clash Ex Mla Varma Angry Over Chandrababu Photo Issue

TDP vs Janasena Clash: కాకినాడ జిల్లా పిఠాపురంలో పాడా కార్యాలయంలో మరోసారి టీడీపీ వర్సెస్‌ జనసేనగా మారిపోయింది పరిస్థితి.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన నేతలు, ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిందని ఘర్షణకి దిగారు.. దీంతో, టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.. జనసేన నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో ఘర్షణకు దిగారు టీడీపీ కార్యకర్తలు.

Read Also: Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు

అయితే, ఈ పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు మాజీ ఎమ్మెల్యే వర్మ.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబుపై ఫైర్‌ అయ్యారు వర్మ.. అసలు దొరబాబు ఎవడు? అని ప్రశ్నించారు.. మట్టి వ్యాపారం చేసుకునేవాడు మళ్లీ చెరువులు తవ్వడానికి వచ్చాడని ఆరోపించారు.. తెలుగుదేశం ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ కార్యకర్తలు మా మీద కలబడి ఖబడ్దార్ హెచ్చరిస్తున్నారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ప్రశాంతంగా ఉంటున్నాం అన్నారు.. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు ఫొటో ఉండి తీరాలి అని స్పష్టం చేశారు.. గెలిపించిన తెలుగుదేశాన్ని మీద పడి కొడతారా? అంటూ మండిపడ్డారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత వర్మ..