Reading Time: 2 minutes
Nawaz Sharif Watches Dhurandhar 2 Secretly

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్-2’ సినిమా భారీ విజయంతో దూసుకెళ్తోంది. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శనను పాకిస్థాన్‌లో అధికారికంగా నిషేధం విధించారు. కానీ పైరసీ రూపంలో అనధికారికంగా దాయాది దేశంలో చలామణి అవుతోంది.

అయితే ధురందర్-2 సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను రహస్యంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వీక్షించినట్లుగా పాకిస్థాన్ జర్నలిస్ట్ ఖలీద్ మెహమూద్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నవాజ్ కుమార్తె మరియం నవాజ్‌ను కూడా జర్నలిస్ట్ ట్యాగ్ చేశాడు. ఇక ఈ సినిమాను విడుదలైన రోజునే మార్చి 19న తాను లాహోర్‌లో వీక్షించినట్లుగా జర్నలిస్ట్‌ తెలిపాడు.

అయితే ధురందర్-2 సినిమాను నవాజ్ షరీఫ్ రహస్యంగా చూశారని.. తనను పోలి ఉన్న పాత్రను చూసి ఎంతగానో మురిసిపోయారని.. తన పాత్రను ప్రశంసించారని జర్నలిస్ట్ తెలిపాడు. సినిమా కాపీని ఏర్పాటు చేయాలని తన స్నేహితుడిని షరీఫ్ కోరారని.. సినిమా కాపీని తెప్పించుకుని పూర్తిగా సినిమా వీక్షించారని పేర్కొన్నాడు.

Pd

ధురంధర్-2లో సినిమాలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక నవాజ్ షరీఫ్ పాత్రలో ప్రముఖ చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి మనవడు మషూర్ అమ్రోహి నటించారు. నవాజ్ షరీఫ్‌కు తగ్గట్టుగానే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రను సహజంగా చూపించేందుకు అమ్రోహీ ప్రత్యేకమైన ప్రోస్తెటిక్ మేకప్‌తో పాటు ప్రత్యేక బాడీ సూట్ ఉపయోగించినట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే మొదట మషూర్ అమ్రోహి… మెజర్ ఇక్బాల్ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వగా.. ఆ పాత్ర చివరికి నటుడు అర్జున్ రాంపాల్‌కు దక్కింది.

Ew

ధురంధర్ -2 పాకిస్థాన్ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా పైరసీ ద్వారా ప్రదర్శింపబడుతోంది. స్థానిక మార్కెట్లలో సినిమా కాపీలు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇక నవాజ్ షరీఫ్.. ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నయ్య.