
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఈ మాజీ జంట వ్యవహారంలోకి ఇప్పుడు గోవా ల్యాండ్ ఇష్యూతో పాటుగా దళపతి విజయ్ పేరు కూడా చేరడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జయం రవి తన సన్నిహితురాలు, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్తో కలిసి గోవాలో సుమారు రూ. 42 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో జయం రవి తన వైవాహిక స్థితి దగ్గర ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్తీతో ఇంకా చట్టబద్ధంగా విడాకులు రాకముందే, కోర్టులో కేసు నడుస్తుండగానే రవి ఇలా ఎలా పేర్కొంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read :Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
ఇటీవల ఒక రిసెప్షన్ వేడుకలో దళపతి విజయ్, త్రిష ఒకే రంగు దుస్తుల్లో మెరవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది, సరిగ్గా ఇదే తరహాలో గతంలో జయం రవి, కెనిషా కూడా ఒకే కలర్ డ్రెస్సుల్లో కనిపించిన వీడియోలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. విజయ్-త్రిషల గురించి ఇంతగా మాట్లాడుతున్న జనం, గత ఏడాది జయం రవి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆర్తీ పరోక్షంగా ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్తీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. “ఒక స్త్రీ గౌరవం అనేది ఆమె భర్త ఇచ్చే విలువపై ఆధారపడి ఉండకూడదు. పోయిన ఏడాది ఇలాంటిదే జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఇప్పుడెందుకు ఇంతలా చర్చిస్తున్నారు?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కెనిషాను తన ‘కంపానియన్’ అని చెప్పుకుంటూ పార్టీలు, ఫంక్షన్లకు తీసుకెళ్తున్న జయం రవి, మరోవైపు భూమి పత్రాల్లో ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొనడంపై ఆయన నుండి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాలి.