Reading Time: < 1 minute
Whats Today On 21st March 2026

* ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా

* త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం…

* ఇవాళ రంజాన్‌.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు..

* హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు.. పాతబస్తీ మీర్ ఆలం ఈద్గాలో కాసేపట్లో ముస్లిం సోదరుల సామూహిక రంజన్ ఈద్-ఉల్-ఫితర్ ప్రార్ధనలు.. ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. భారీ బందోబస్తు ఏర్పాటు.. మిరాలం ఈద్గా పరిసరాల్లో ఉదయం 7 నుండి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. మీర్ ఆలం ఈద్గా రూట్.. జూపార్క్, బహదూర్‌పురా, కాలాపత్తర్, నవాబ్ సాహెబ్ కుంట, పురానాపూల్, శాస్త్రిపురం, దానమ్మ హట్స్ ట్రాఫిక్ ఆంక్షలు

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,272 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు