Reading Time: < 1 minute

మొజ్తబా ఆచూకీ చెప్తే రూ. 92 కోట్లు..బౌంటీ ప్రకటించిన అమెరికా

Caption of Image.

వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ లేదా ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి అమెరికా10 మిలియన్ డాలర్ల (రూ. 92 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌‌మెంట్ తన ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం ద్వారా ఈ ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. 

ఈ జాబితాలో సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో పాటు, ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారీజానీ, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. 

సమాచారం ఇచ్చే వారు సిగ్నల్ యాప్ లేదా టోర్ ఆధారిత టిప్‌‌లైన్ ద్వారా తమ వివరాలను పంపవచ్చని, వారికి రివార్డుతో పాటు వేరే ప్రాంతానికి తరలించే సదుపాయం కూడా కల్పిస్తామని అమెరికా భరోసా ఇచ్చింది.

©️ VIL Media Pvt Ltd.