Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మరో దఫా విచారణ కోసం నటుడు, టివికె చీఫ్ విజయ్‌కు సిబిఐ మంగళవారం సమన్లు జారీ చేసింది. గతంలో జనవరి 12,19 తేదీల్లో ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను ఇప్పటికే ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ నుంచి కేసును స్వాధీనం చేసుకున్న సిబిఐ, గతేడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూరులో జరిగిన విజయ్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, 60 మందికి పైగా గాయపడిన తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది.

అక్టోబర్లో దర్యాప్తు చేపట్టడానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సిబిఐ డైరెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరియు ఏజెన్సీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.