
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో ప్రమాదం చోటు చేసుకుంది. హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.