
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంకల్పించిన విజన్–2047 లక్ష్యాలను సాధించడంలో మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు, సహకారంతో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి కోరారు.