
Bengaluru Horror: బెంగళూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పి, ఒక మహిళ తన లవర్ కళ్లకు గంతలు కట్టి సజీవదహనం చేసింది. మహిళన తన ఇంట్లోనే పథకం ప్రకారం 27 ఏళ్ల యువకుడిని హత్య చేసింది. ఈ ఘటన బైదరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుడిని కిరణ్గా, నిందితురాలిని ప్రేరణగా గుర్తించారు.
Read AlSO: Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. తనను పట్టించుకోవడం లేదనే కోపంతో మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. వెరైటీగా ప్రపోజ్ చేస్తానని కిరణ్ను నమ్మించిన ప్రేరణ.. కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి, ఆపై అతనికి నిప్పంటించింది. ఈ మొత్తం ఘటనను కెమెరాలో బంధించింది. వీరిద్దరు గతేడాది కాలం నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే, కొంత కాలంగా తనను కిరణ్ పట్టించుకోవడం లేదని ప్రేరణ కోపం పెంచుకుంది.
మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నానని ప్రేరణ కిరణ్ను రప్పించింది. కిరణ్ వచ్చిన వెంటనే వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేయడానికి కిరణ్ను కట్టేయడం ప్రారంభించింది. ఇందుకు కిరణ్ అభ్యంతరం చెప్పగా, ఇది విదేశాల్లో చేసే పద్ధతి అంటూ మాయమాటలు చెప్పింది. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్ను అతడిపై పోసి నిప్పంటించింది. రాజాజీ నగర్లోని బాష్యం సర్కిల్లోని వీఐ స్టోర్లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ డీఎల్ నాగేష్ చెప్పారు.