
ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో ఒక క్రేజీ అప్డేట్ తెగ హల్చల్ చేస్తోంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గాయపడ్డ సింహం’. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ‘మెగా’ సర్ప్రైజ్ను చిత్రబృందం అత్యంత రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్కు చెందిన ఒక హ్యాపెనింగ్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్. అది కూడా ఏదో మెరుపుతీగలా వచ్చి వెళ్లే అతిథి పాత్ర కాదు.. ఏకంగా 40 నిమిషాల పాటు సాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవబోతున్నారట. సినిమా మలుపు తిరిగే కీలక సన్నివేశాల్లో ఈ హీరో ఎంట్రీ ఇస్తారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే.. సదరు స్టార్ హీరోతో పాటు ఆయన తండ్రి* కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. విశేషమేమిటంటే, ఆయనకు ఇదే డెబ్యూ (తొలి) సినిమా. వెండితెరపై తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి పెద్ద అప్డేట్స్ ఉంటే సినిమా ప్రమోషన్ల కోసం ముందే వాడేసుకుంటారు. కానీ ‘గాయపడ్డ సింహం’ టీం మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడింది. థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన థ్రిల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆ “మిస్టరీ హీరో” ఎవరో తెలిస్తే బాక్సాఫీస్ దగ్గర కాస్త గట్టిగానే వర్కౌట్ కావడం ఖాయమనిపిస్తోంది. మరి ఆ హీరో ఎవరనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!