
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతోంది. కానీ ఇంకా సగానికి పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంత స్లోగా నడుస్తున్న ఈ సినిమా.. ఇదే ఏడాదిలో రిలీజ్ అవుతుందా? అంటే, లేదనే మాట వినిపిస్తోంది. మొదట 2026 జూన్లో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలకు తోడు.. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట.
Also Read : Dhanush : మృణాల్ ఠాకూర్ కోసం పీరియడ్ కథ రెడీ చేసిన ధనుష్
అందుకే.. డ్రాగన్ డిలే అవుతు వస్తోంది. గతంలో 2026 జూన్ 25న సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించినా ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ ఇప్పుడు 2027కి వెళ్లిపోయింది. తాజాగా ఈ సినిమా ను 2027జూన్ 11 రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్ గా ప్రకటిచారు. అలాగే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ను ఱిలిజ్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే వపర్ ఫుల్ గ్లింప్స్ కట్ చేసి ఉంచారు. ఈ విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. భారీగా వెయిట్ లాస్ అయి, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. దీంతో.. డ్రాగన్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. పక్కా ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.