
జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన మరణం కోరుకుంటున్న వారికి తనదైన శైలిలో సమాధానమిస్తూనే, రాష్ట్రంలో ప్రస్తుత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడటానికే వీల్లేకుండా రూలింగ్ ఇచ్చేవారు. బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు భరించలేక పార్టీ పెట్టి బయలుదేరాను. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సాధించాను” అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు కొందరు కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని, కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవని, తాను ఇప్పుడప్పుడే చావనని స్పష్టం చేశారు.
KCR: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సక్కగా ఉండేది. ఇప్పుడు కరెంటుకు ఏ రోగం వచ్చింది? ఏమైనా కాకి ఎత్తుకపోయిందా?” అని ప్రశ్నించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న రాష్ట్రాన్ని ఈ ‘దరిద్రుల’ చేతిలో పెడితే.. నేడు ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను హెచ్చరించినట్లే జరుగుతోందని కేసీఆర్ అన్నారు. “వీళ్లు గెలిస్తే దళిత బంధుకి జైభీమ్, రైతుబంధుకి రాం రాం అని చెబుతారని ముందే చెప్పాను.
CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
ఇప్పుడు అదే జరుగుతోంది. రైతుబంధు డబ్బులు నెలల తరబడి వేస్తారా? రైతుల కష్టాలు వీళ్లకు పట్టడం లేదు” అని మండిపడ్డారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ పథకాన్ని ఎందుకు కుంటుపడేలా చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైతే.. “లాగులు పగిలేలా కొట్టాలి” అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగదని, కాంగ్రెస్ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.