Reading Time: < 1 minute
Mumbai Indians Set Target Of 200 Runs For Gujarat

ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ కు దిగింది. తిలక్ వర్మ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. సెంచరీతో చెలరేగిన తిలక్ ముంబైకి భారీ స్కోర్ అందించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. గుజరాత్ కు 200 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభం పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్ 13 పరుగులకే ఔటయ్యాడు. అరంగేట్రం చేసిన డానిష్ కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమై, కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తిలక్ వర్మ, నమన్ ధీర్ అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 13వ ఓవర్‌లో నమన్ ధీర్ 45 పరుగుల వద్ద ఔటవడంతో ముంబైకి నాలుగో దెబ్బ తగిలింది. నమన్ తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

ఆ తర్వాత తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. గాయమైనప్పటికీ, తిలక్ ఆటను కొనసాగించి, కేవలం 45 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. 20వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తిలక్ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాధాడు. తిలక్ వర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని కేవలం 45 బంతుల్లోనే సాధించాడు. అతను చేసిన అజేయ 101 పరుగులే ఈ లీగ్‌లో అతని అత్యుత్తమ స్కోరు.