Reading Time: < 1 minute
Telangana Congress Ugadi Wishes Mahesh Kumar Gaud Revanth Reddy 2026

Panchanga Sravanam: తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో మేలు జరగాలని కోరుకున్నారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండేలా భగవంతులు ఆశీస్సులు ఉండాలి. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల మద్దతు తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఏఐసీసీ నాయకులు ఖర్గే , సోనియాగాంధీ రాహుల్ గాంధీ కృషితో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు అంత ఎంతో శ్రమించి ఒక అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో ఎవరు ఎవర్ని పరాభవం చేయకుండా అంత కలిసి కట్టుగా సుఖ శాంతులతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విదంగా అర్హులైన వారి లబ్ది పొందే విదంగా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు..

READ MORE: Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్‌కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్!

ఇక గాంధీ భవన్‌లో చిలురు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దేశాలు యుద్ధాన్ని కోరుకుంటాయి. ప్రపంచం దేశాల యుద్ధం తో దేశం నష్టపోతుంది.. అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతాయి. విడాకుల కేసులు పెరిగే అవకాశం ఉంది.. కొత్త చట్టాలతో పాత చట్టలకు మంగళం పాడతారు. రాశి ఫలాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ నూతన పదవులు అలంకరించ బోతున్నారు. పీసీసీకి ప్రతి ఒక్కరు సహకరించాలి.. అడుగుజాడల్లో నడవాలి. వాణిజ్య పంటలు ఈ సారి సమృద్ధిగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంగా ఉంటారు. పడిన పంటకు మంచి ఫలితం రైతులకు అందుతుంది. ఒడిదుడుకులు ఉన్న సీఎం రేవంత్‌కి పాలన పరంగా ఇబ్బందులు లేవు..” అని వివరించారు.