
‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. మెగా పవర్ స్టార్ రామ్చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్తో గతంలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఇప్పుడు చరణ్తో అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ పై కసరత్తులు చేస్తున్నాడు సుక్కు. ఇప్పటికే కథ విషయమై చరణ్, సుకుమార్ సుదీర్ఘంగా చర్చించుకున్నట్టు టాక్.
అయితే కథా చర్చలు ఫైనల్ స్టేజ్కి చేరుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మాత్రం దసరా పండగ తర్వాతే ప్రారంభం కానుందని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం రామ్చరణ్కు అయిన గాయమేనని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో చరణ్ చేతికి గాయమైంది. ఇప్పుడు ఆ చేతికి సర్జరీ చేయించుకోనున్నారు చరణ్. సర్జరీ పూర్తయ్యాక కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లో సుకుమార్ ఆర్సీ 17 ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నాడు. కథ, లొకేషన్ల వేట, ఇతర సాంకేతిక పనులు ముగియడానికి దసరా వరకు సమయం పడుతుంది. కాబట్టి అంతా పక్కాగా సిద్ధం చేసుకుని దసరా శుభ ముహూర్తాన ఈ క్రేజీ కాంబోను సెట్స్పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఆర్సీ 17 ఎప్పుడొచ్చిన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి.