పిల్లలు చాక్లెట్స్ను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ బయట కొనుగోలు చేయడం కాకుండా, ఈ సారి ఇలా ఇంటిలోనే సులభంగా మీ పిల్లలకు చాక్లెట్స్ చేసి ఇవ్వండి. ఇది వారి కండరాల బలానికి చాలా అద్భుతంగా పని చేస్తుంది.
పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమపిల్లలకు బయటవి కొనుగోలు చేయకుండా , ఇటిలోనే సులభంగ తయారు చేయాలి అనుకుంటారు. అయితే కేవలం మూడు పదార్థాలతోనే ఇలా చాక్లెట్స్ చేస్తే, అచ్చం షాప్లో కొనుగోలు చేసే చాక్లెట్స్లా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదంట.
కావాల్సిన పదార్థాల్లోకి వెళితే: ఖర్జూరాలు, నువ్వులు, ఉప్పు, నెయ్యి . తయారీ విధానంలోకి వెళితే, ముందుగా నువ్వులను వేయించుకోవాలి. తర్వాత అదే పాన్లో నెయ్యి వేసి , అది వేడి అయిన తర్వాత ఖర్జూరాల వేసి దానిని మంచిగా ఉడికిచుకొని, మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఖర్జూరా పేస్ట్ను బటర్ పేపర్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు చిటికెడు ఉప్పు వేసి మంచిగా కలుపోవాలి. దానిని చాలా మెత్తగా కలుపుకోవాలి.తర్వాత చిన్న చిన్న చాక్లెట్స్లా తయారు చేసుకోవాలి.
బటర్ పేపర్ తీసుకొని దానిలో చిన్న చిన్న చాక్లెట్స్ మాదిరిగా తయారు చేసుకోవాలి. తర్వాత వాటిని ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చాక్లెట్స్ రెడీ.




