
న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్ డే పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రైమ్ సభ్వత్వం ధరను రూ.1,500 నుంచి రూ.వెయ్యికి తగ్గించారు. అంతేగాక వచ్చే నెల 4–6 తేదీల్లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తారు. 72 రెండు గంటల పాటు జరిగే ఈ సేల్లో అనేక ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచ్లు ఉంటాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై ఐదు శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. 500లకు పైగా కొత్త ఉత్పత్తులు ఈ సేల్లో అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ఉంటాయి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను ప్రదర్శించనున్నారు.