
అన్ని సినీ పరిశ్రమల్లో వారసుల సందడి పెరిగిపోతోంది. బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ కూడా ఈ జాబితాలో చేరింది. తమిళ సినీ రంగంలో ప్రముఖ తారల వారసులు వెండితెరపై తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొంతమంది స్టార్ కిడ్స్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, మరికొందరు త్వరలోనే తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ సినీ కార్యక్రమాలలో కనిపిస్తున్న యాత్ర, త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నాడు. ధనుష్ దర్శకత్వంలోనే యాత్ర హీరోగా పరిచయం కావడం విశేషం. దళపతి విజయ్ తనయుడు సంజయ్ సైతం సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అయితే సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా కోలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న సిగ్మా చిత్రంతో సంజయ్ మెగాఫోన్ పట్టనున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :