Reading Time: < 1 minute

ట్రైన్లో నుంచి పడిన గుర్తుతెలియని వ్యక్తి మృతి.. బీబీనగర్, ఘట్ కేసర్ స్టేషన్ల మధ్య ఘటన

Caption of Image.

యాదాద్రి, వెలుగు : ట్రైన్​ నుంచి జారిపడి తీవ్ర గాయాలతోట్రీట్​మెంట్​ పొందుతూ గుర్తు తెలియని యువకుడు (20)  మృతిచెందాడు. ఈ నెల 5న నడికుడి నుంచి కాచిగూడకు వెళ్తున్న డెమో ట్రైన్​ నుంచి బీబీనగర్, ఘట్కేసర్​ స్టేషన్ల మధ్య ఓ యువకుడి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. భువనగిరి రైల్వే పోలీసులు అతడిని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి చాతిపై సిద్ధు, రెండు చేతులకు రోజా, ఐసూ టాటూలు ఉన్నాయని భువనగిరి రైల్వే పోలీస్​ ఇన్​చార్జ్​ జే కృష్ణారావు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 98482 22169 నెంబర్​కు సమాచారం  ఇవ్వాలని కోరారు. 

 

©️ VIL Media Pvt Ltd.