
IND vs AFG: చెన్నై వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్లో.. ఆట ప్రారంభానికి ముందే ఒక క్రేజీ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ క్రికెట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. టాస్ ప్రెజెంటర్, మాజీ భారత స్పిన్నర్ మురళీ కార్తీక్ (Murali Kartik).. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో లైవ్లో చేసిన కామెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మళ్లీ బౌలింగ్ అనకు బ్రో.. మురళీ కార్తీక్ సెటైర్:
ఈ సిరీస్లో అంతకుముందు జరిగిన టాస్ నిర్ణయాలను మైండ్లో పెట్టుకుని మురళీ కార్తీక్ ఒక రేంజ్లో ఫన్ క్రియేట్ చేశాడు. టాస్ గెలిచిన వెంటనే షాహిదీ వైపు చూస్తూ కార్తీక్ నవ్వుతూ.. నువ్వు మళ్లీ మొదట బౌలింగ్ చేస్తామని మాత్రం చెప్పకు బ్రో అంటూ జోక్ చేశాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.
గుడ్ బాయ్ అంటూ కితాబు.. తెగ నవ్విన షాహిదీ:
మురళీ కార్తీక్ కామెంట్కు స్పందించిన ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిదీ నవ్వుతూ.. మేము ఈరోజు మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నామని కన్ఫర్మ్ చేశాడు. దానికి కార్తీక్ తక్షణమే స్పందిస్తూ.. గుడ్ బాయ్ అంటూ సరదాగా ప్రశంసించాడు. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ టాస్ సమయంలో ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అండ్ ఎంటర్టైనింగ్ మూమెంట్ రావడంతో టీవీల్లో చూస్తున్న వ్యూయర్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ALSO READ : గ్రౌండ్లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్..
చెపాక్లో భారీ స్కోరే టార్గెట్:
ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఈసారి ఎలాగైనా ఇండియాపై ప్రెజర్ పెట్టి సిరీస్ను ఘనంగా ముగించాలని ప్లాన్ చేస్తోంది. చెన్నై (చెపాక్) పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో.. మొదట భారీ స్కోరు బోర్డుపై పెట్టి, ఆ తర్వాత స్పిన్నర్లతో భారత జట్టుని కట్టడి చేయాలని షాహిదీ భావిస్తున్నాడు. ఏదేమైనా మ్యాచ్ ప్రారంభానికి ముందే మురళీ కార్తీక్ చేసిన ఈ కామెడీ కామెంట్స్ క్రికెట్ లవర్స్కు మంచి కిక్ ఇచ్చాయి.
🚨 Toss update from Chennai 🚨
Afghanistan have won the toss & elected to bat first in the 3rd ODI.
Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J52qBBAtxm
— BCCI (@BCCI) June 20, 2026