ఆచార్య చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
భార్యాభర్తల అన్న తరవాత సవాలక్ష ఉంటాయి వారిలో మధ్య మూడో వ్యక్తి జోక్యం అస్సలు ఉండకూదు ఇంకా అపార్థాలకు, బంధం బలహీనపడటానికి కూడా ఇదే కారణమవుతుంది. వీళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దు. ఇది గొడవను వాదనను మరింత పెంచుతుంది. వీరి మధ్య మాట్లాడకపోవడమే మంచిది.
ఇంకా గురువులు, పండితుల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీరు అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు అది అగౌరవం కూడా. మీకు అంతగా మాట్లాడలని ఉంటే సరైన సమయం చూసి వారిని ప్రశ్నలు అడగడం చాలా మంచిది. కానీ అనవసరంగా మధ్యలో మీ విలువను మీరు పోగొట్టుకోవద్దు
ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక హద్దు ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. ఇంకా సందర్భం లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదు. ఇంకా వివాదాలు కూడా ఏర్పడతాయి . అలాగే , పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైతే తప్ప సైలెంట్ గా ఉండటం ఉత్తమం అని చాణక్యుడు చెబుతున్నారు
కాబట్టి కొందరితో మాట్లాడేటప్పుడు దూరంగా ఉండండి మీకు చాలా మంచిది.అలాంటి సమయంలో మౌనంగా ఉండటం మంచిది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)




