
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్నగర శివారులోని మాక్లూర్మండలం మానిక్బండార్వద్ద నిర్మించిన అరణ్య అర్బన్పార్క్ను గురువారం సీఎం రేవంత్రెడ్డి వర్చువల్పద్ధతిలో ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా 476 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పార్క్ను ప్రజలకు అంకితం చేశారు. అలసిసొలసి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం, ఉల్లాసం కలుగాలని సీఎం ఆకాంక్షించారు.
ప్రారంభోత్సవ వేడుకను ప్రజలు చూసేలా ఎల్ఈడీ స్ర్కీన్ను ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్కన్జర్వేటర్అర్పన, కలెక్టర్ఇలా త్రిపాఠి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్డెవలప్మెంట్ కార్పొరేషన్చైర్మన్మానాల మోహన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు కిరణ్కుమార్, భుజంగరావు, డీఎఫ్వో సిద్దార్థ్విక్రమ్సింగ్ తదితరులు ఉన్నారు.