Reading Time: 2 minutes

ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. ప్రతి నెలా తమ కష్టార్జితం నుంచి కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం పీఎఫ్ ఖాతాలో దాచుకునే వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎఫ్ వడ్డీ డబ్బులు త్వరలోనే మీ అకౌంట్లలో జమ కాబోతున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపడంతో, ఇక డబ్బులు పడటమే తరువాయి. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వడ్డీ రేటు ఎంతంటే?: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ (EPF) డిపాజిట్లపై ఏకంగా 8.25 శాతం వడ్డీని ఇవ్వాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇక మార్చి నెలలో జరిగిన ఒక కీలక సమావేశంలో ఈ వడ్డీ రేటుకు ఆమోదం లభించింది. ఈ వడ్డీ రేటుతో ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే మొత్తం భారీగానే పెరగనుంది.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును ఖరారు చేసిన తర్వాత, దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపారు. తాజాగా ఆర్థిక శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే, ఈ 8.25 శాతం వడ్డీకి ప్రభుత్వ ఆమోద ముద్ర పడిపోయిందన్నమాట. ఇక కేంద్రం నుంచి లాంఛనంగా ఫైనల్ క్లియరెన్స్ రాగానే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి.

Big News for 70 Million People! Green Signal for PF Interest Credit
Big News for 70 Million People! Green Signal for PF Interest Credit

7 కోట్ల మందికి లబ్ధి: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ వడ్డీ డబ్బులు వారందరి ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. ఈ డబ్బులు ఖాతాల్లో పడితే ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరట దొరుకుతుంది.

మొత్తానికి ఎన్నాళ్లుగానో వడ్డీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సగటు ఉద్యోగి నిరీక్షణ ఫలించింది. కేంద్రం నుంచి అధికారికంగా డబ్బులు జమ చేసే ప్రక్రియ మొదలవగానే, మీ పీఎఫ్ పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

గమనిక: మీ పీఎఫ్ అకౌంట్ కు సరైన మొబైల్ నెంబర్ మరియు ఆధార్ లింక్ అయ్యాయో లేదో ముందే ఒకసారి సరిచూసుకోండి. అప్పుడే వడ్డీ డబ్బులు జమ అయిన వెంటనే మీకు మొబైల్ కు మెసేజ్ ద్వారా సమాచారం వస్తుంది.

The post 7 కోట్ల మందికి బంపర్ న్యూస్! PF వడ్డీ జమకు గ్రీన్ సిగ్నల్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.