Reading Time: < 1 minute
Jd Vance Iran Talks Ball In Irans Court Us Strategy Kharg Island Strikes

బంతి ఇప్పుడు ఇరాన్‌ కోర్టులో ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జేడీ వాన్స్ మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ ప్రభుత్వం విశ్వాసంగా ఉందన్నారు. అయితే చర్యల విషయంలో మాత్రం అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని సూచించారు.

ఇది కూడా చదవండి: Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

‘‘ఖర్గ్ దీపంలోని కొన్ని సైనిక లక్ష్యాలను మేము దాడి చేయాలని నిర్ణయించుకున్నాం. అవి విజయవంతంగా పూర్తయ్యాయని భావిస్తున్నాను. ఇరాన్ నుంచి సరైన ప్రతిపాదన వచ్చే వరకు మేము చమురు, ఇతర మౌలిక వసతులపై దాడులు చేయం” అని జేడీ వాన్స్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

సంఘర్షణను ముగించే చర్చల్లో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటల లోపు ఇరాన్ నుంచి ప్రతిస్పందనను రాబట్టగలమని ట్రంప్ ప్రభుత్వం ధీమాగా ఉందని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను విడనాడాలని.. అలాగే కీలకమైన చమురు రవాణా జలమార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు.