
కోల్కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
కోల్కతాలోని తారతల పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక గిడ్డంగి పైకప్పు కూలిపోయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం పశ్చిమ కోల్కతా పరిధిలోకి వస్తుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం, పౌర రక్షణ బృందాలతో పాటు అగ్నిమాపక యంత్రాలను కూడా సంఘటనా స్థలానికి పంపినట్లు కోల్కతా పోలీసులు తెలిపారు.
తారతలా ప్రాంతంలో ఈ ప్రమాదం అకస్మాత్తుగా జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన చాలా మంది పనిచేస్తున్నారు. సహాయక, రెస్క్యూ బృందాలు ఏడుగురిని రక్షించారు. స్థానికులు కూడా సహాయక చర్యలు ప్రారంభించారు. షెడ్లు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. రక్షించబడిన వారిని పరిపాలనా బృందాలు ఆసుపత్రులకు తరలించాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో 40 నుంచి 45 మంది పూడిపోయి ఉండవచ్చని భయపడుతున్నారు.
#WATCH | Kolkata, West Bengal | Cranes deployed to lift the rubble at the site where an under-construction godown shed collapsed in Taratala.
Indian Army arrives on the spot pic.twitter.com/EIEGy0gETL
— ANI (@ANI) June 24, 2026
#WATCH | Kolkata | West Bengal | Search and rescue operation underway at the site where an under-construction godown shed collapsed in Taratala. https://t.co/O68iBSS8Lb pic.twitter.com/rU10750Fnl
— ANI (@ANI) June 24, 2026