Reading Time: < 1 minute

‘కేబీఆర్’ వన్‌‌ వే ట్రయల్ డ్యూటీ  సిబ్బందికి గాయాలు

Caption of Image.
  •  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం వన్‌‌వే ట్రయల్ రన్ లో భాగంగా ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీస్​సిబ్బంది మంత్రి అశోక్​కుమార్​ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలి చీలమండ విరగడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. 

ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు, తోటి సిబ్బంది అశోక్​కుమార్​ను ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. బాధితుడు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫిల్మ్‌‌నగర్ పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.