
స్టార్ హీరోయిన్ సమంత తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. మొదట ఈ కథకు సాయి పల్లవిని అనుకున్నప్పటికీ, చివరకు సమంత ఈ ప్రాజెక్ట్లోకి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఏకైక ప్లస్ పాయింట్ సమంత మాత్రమే. స్వర్ణ అలియాస్ ఝాన్సీ పాత్రలో ఆమె ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ రెండిటిలోనూ తన అనుభవాన్ని చూపించి, సినిమాను భుజాలపై మోసింది. కానీ, ఒకప్పుడు కళ్ళతోనే మ్యాజిక్ చేసే సమంత మార్క్ ఇందులో ఎక్కడా పెద్దగా కనిపించలేదు.
అసలు సమస్య కథలో కాదు, స్క్రీన్ ప్లే లోనే ఉంది. ఫ్యామిలీ డ్రామాగా మొదలైన సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మారే క్రమంలో ఎమోషనల్ కనెక్ట్ ను పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. విలన్ పాత్ర కూడా టెన్షన్ పెట్టాల్సింది పోయి విసుగు తెప్పిస్తుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా కీలక సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రమోషన్లతో ఎంత హైప్ తెచ్చినా, రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. సమంత ఫ్యాన్స్ కు ఓకే అనిపించినా, కామన్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. వేరే సినిమాల ఆప్షన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ బానే వస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది కానీ కంటెంట్ విషయంలో ఏదో వెలితి కనిపిస్తోంది అనేది సినీ విశ్లేషకుల వాదన.