ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం, రాగి పిండి వేసి పాయసం వేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్ధాలు అర కప్పు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, రెండు కప్పులు పాలు, రెండు కప్పులు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ యాలకుల పొడి, ఇంకా
జీడిపప్పు 10, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి.
సగ్గుబియ్యం రాగి పిండి పాయసం తయారి విధానం : ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుని బాగా కడిగి కనీసం 39 నిమిషాలు పాటు వీటిని నానబెట్టాలి. ఇంకా ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించుకోవాలి. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి మెత్తగా ఉడికించాలి. అలాగే ఈ రాగి పిండిలో నీరు పోసి దీనిని ఉండలు లేకుండా పలుచగా కలపాలి.
సగ్గుబియ్యం రాగి పిండి పాయసం తయారి విధానం :ఈ సగ్గుబియ్యం ఉడికిన బాగా తర్వాత రాగి పిండి మిశ్రమాన్ని కూడా వేసి దీనిని బాగా కలపాలి. ఇలా దీనిలో 10 నిమిషాలు బాగా మరిగించి రాగి పిండి వాసన పోయే వరకు పాన్ లో ఉంచి బాగా ఉడికించాలి.
ఇప్పుడు పాలు పోసి మరో 5 నిమిషాలు మరిగించాలి.
సగ్గుబియ్యం రాగి పిండి పాయసం తయారి విధానం స్టెప్ 3: ఇక ఇప్పుడు బెల్లాన్ని ఒక పెద్ద పాత్రలో వేసుకుని నీటిలో బాగా కరిగించి వడకట్టి దీనిని పాయసంలో మిక్స్ అయ్యేలా కలపాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇంకా చిన్న పాన్లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక నాలుగు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి పాయసంలో వేసి గరిటేతో కలిసిపోయే వరకు దీన్ని కలపాలి.
రాగి పిండి పాయసం తినడం వలన లాభాలు ఇవే : ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇంకా ఈ రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. వీటిని తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇది సహాయ పడుతుంది. జీర్ణక్రియకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. నీరసం, అలసటను తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది.




