Reading Time: < 1 minute

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Caption of Image.

గంగాధర, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి భరోసానిస్తోందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ గ్రామాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్పంచులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.