Reading Time: < 1 minute

యుద్దంతో కాదు..చర్చలతోనే సమస్యలు పరిష్కారం: ప్రధాని మోదీ

Caption of Image.

పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో వివాదాలను  త్వరగా ముగించాలని  ప్రధాని  మోడీ పిలుపునిచ్చారు. యుద్దంతో ఏ సమస్యలు పరిష్కారం కావని..చర్చలతో నే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఫిన్ ల్యాండ్ అధ్యక్షుడితో భేటీ అయిన మోడీ.. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు జాయిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ..  సైనిక వివాదం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేం.   అది ఉక్రెయిన్ అయినా లేదా పశ్చిమాసియా  వివాదాలను త్వరగా ముగించడానికి శాంతి కోసం మేం  దౌత్యపరమైన చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నాం.  ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ప్రపంచ సవాళ్లను పరిష్కరించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ఉమ్మడి నిబద్ధత అని అన్నారు.

AI నుంచి  6G టెలికాం వరకు, క్లీన్ ఎనర్జీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు ఈ భాగస్వామ్యం అనేక హైటెక్ రంగాలలో ఫిన్ ల్యాండ్ తో   పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నాం. భారత్, ఫిన్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

ఇరాన్ పై  అమెరికా – ఇజ్రాయోల్ మధ్య కొన్ని రోజులుగా యుద్దం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ,ఆయన ఫ్యామిలీని అమెరికా మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతీకారంగా  ఇరాన్ అమెరికా ,ఇజ్రాయోల్ పై ప్రతిదాడులకు దిగుతోంది. 

©️ VIL Media Pvt Ltd.