
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’, ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఫెయిల్యూర్స్ ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు.
అయితే భాగ్యశ్రీ కెరీర్కు నిజమైన టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం ‘కాంత’, ‘లెనిన్’ చిత్రాలే అని చెప్పాలి. ‘కాంత’ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక రీసెంట్గా వచ్చిన ‘లెనిన్’ సినిమాలో తన పాత్రతో మెప్పించి, సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా సమర్థవంతంగా చేయగలనని నిరూపించుకోవడంతో భాగ్యశ్రీ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఈ సక్సెస్ తెచ్చిపెట్టిన క్రేజ్తో తన రెమ్యునరేషన్ను కూడా డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక ఇప్పుడు భాగ్యశ్రీ కెరీర్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లే మరో బిగ్ ఆఫర్ తలుపు తట్టింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, నాని సరసన ఫస్ట్ టైమ్ నటించే అవకాశం రావడంతో పాటు భాగ్యశ్రీ కెరీర్కు ఇది బిగ్ బూస్ట్ కానుంది.