Reading Time: < 1 minute

మైహోమ్ భుజా గణపతి లడ్డూ స్కాం.. మూడున్నర కోట్ల మోసం కేసులో నిందితుడు గణేశ్ అరెస్ట్

Caption of Image.

గచ్చిబౌలి, వెలుగు: అధిక వడ్డీ ఆశచూపి, పలువురి వద్ద దాదాపు మూడున్నర కోట్లు వసూలు చేసిన కేసులో కొండపల్లి గణేశ్​ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. మైహోమ్ భుజాలో నివాసం ఉండే గణేశ్​గతంలో నిర్వహించిన వేలంలో రెండుసార్లు గణపతి లడ్డూను దక్కించుకున్నాడు. 

ఆ తర్వాత కమ్యూనిటీలో ఏర్పడిన పరిచయాలతో బోయిన్​పల్లి కిరణ్ తో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే నెలకు 6 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి వద్ద రూ.3.45 కోట్లు వసూలు చేశాడు. తమను గణేశ్​మోసం చేశాడని బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని శుక్రవారం అరెస్ట్​చేసిన పోలీసులు.. అతడి ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలకు మళ్లించిన డబ్బులపై ఆరా తీస్తున్నారు. మొత్తం డబ్బులను విదేశాలకు తరలించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.