Reading Time: < 1 minute
Ind Vs Eng 2026: ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ

Ind Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ద్వారా టీమిండియా వన్డేల్లో సరికొత్త శకానికి నాంది పలికినట్లు అయింది.

ఈ వన్డే జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎంపిక అనేది పూర్తిగా ఆయన ఫిట్‌నెస్ క్లియరెన్స్ పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది.