Reading Time: < 1 minute

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లేవారికి అలర్ట్ మేసేజ్.. ఇవాళ (జూన్ 21) కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రయల్ రన్

Caption of Image.

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్ మెసేజ్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణక్రమంలో ఇవాళ ( జూన్ 21) వన్ వే ట్రయల్ రన్ ప్రారంభించారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం 10 గంటలనుంచి రాత్రి 8గంటల వరకు వన్ వే ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది. ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైపు నుంచి వచ్చే వాహనాలను బసవతారకం, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యా భవన్ స్కూల్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తున్నారు అధికారులు. అందువల్ల వాహన దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను కొనసాగించాలని వాహనాదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.