Reading Time: < 1 minute
Siddharth Trisha Reunite For Dil Raju Movie Bharthaga Maraku Bacheloru

టాలీవుడ్ వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సిద్ధార్థ్, త్రిషల జోడీ ఒకటి. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట, మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘భర్తగా మారకు బ్యాచిలరూ…’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇదొక రిలేషన్-షిప్ బేస్డ్ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది.

Also Read : Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!

అది కూడా ఒక కొత్త దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారని, పెళ్లి తర్వాత దంపతుల మధ్య జరిగే సరదా సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో సిద్ధార్థ్-త్రిషలతో పాటు మరో యువ జంట కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధార్థ్‌తో ‘బొమ్మరిల్లు’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ తీసిన దిల్ రాజు, ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం విదేశాల్లోనే సాగేలా భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష, ఇప్పుడు తన పాత మిత్రుడు సిద్ధార్థ్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.