
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆయన వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29వ తేదీన సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పనులు హైదరాబాద్లో సందడిగా సాగుతున్నాయి. కాగా ఈ వివాహ వేడుకకు సంబంధించి మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. తన తండ్రి బెల్లంకొండ సురేష్తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన శ్రీనివాస్, ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారితో సరదాగా ముచ్చటించారు. చిరంజీవి, బెల్లంకొండ కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
కాగా సాయి శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి పేరు కావ్య. వీరిద్దరి వివాహ వేడుకకు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వేదిక కానుంది. సుమారు 71 మందికి పైగా సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ వేడుక జరగనుందని సమాచారం. ఇప్పటికే తిరుపతిలో ప్రముఖ హోటళ్లు, కళ్యాణ మండపాల్లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు పెళ్లి సందడి ఉన్నప్పటికీ, శ్రీనివాస్ తన వృత్తిపరమైన బాధ్యతలను కూడా చక్కబెడుతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు భారీ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి కోసం కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత, మళ్ళీ ఈ సినిమాల సెట్స్లో శ్రీనివాస్ అడుగుపెట్టనున్నారు.