Reading Time: < 1 minute
Pm Modi Speaks To Saudi Crown Prince On West Asia Crisis Maritime Security In Focus

సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని భారతీయు సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు మోడీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇంధన సంస్థలపై దాడులను సహించబోమని, సముద్రంలో భద్రతను తప్పనిసరిగా పాటించాలని సౌదీ యువరాజుతో మోడీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ప్రాంతీయ ఇంధన సంస్థలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ సముద్ర వాణిజ్య మార్గాలను తెరిచి, సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.

మంగళవారం ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య కూడా ఫోన్ సంభాషణ జరిగింది. హార్ముజ్ జలసంధి‌పై ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యాక ట్రంప్-మోడీ మధ్య జరిగిన సంభాషణ ఇదే మొదటిది.