Reading Time: < 1 minute
Pm Modi To Hold Video Conference With Chief Ministers On Middle East Crisis And Fuel Concerns

శ్రీరామనవమి రోజున ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో చమురు, గ్యాస్‌పై విపరీతంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంలతో ప్రధాని ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రాచ్యం యుద్ధం కొనసాగితే.. ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Amaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం

గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా లీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో అత్యవసర పరిస్థితులు అమలు అవుతున్నాయి. అలాగే భారత్‌లో కూడా కరోనా కాలం నాటి లాక్‌డౌన్‌ పరిస్థితులు వస్తాయంటూ పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎంలతో మోడీ చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం