Reading Time: < 1 minute
Ap Signs Mou With Indian Culinary Institute To Boost Culinary Tourism

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ (MOU) కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ లు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

Ragi cakes Recipe: జంక్ ఫుడ్‌కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!

తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది. ప్రత్యేకించి కలినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఏపీ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియచేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Uppudu Pindi: షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసేయండి!