
గోదావరిఖని, వెలుగు: ఖాళీగా ఉన్న రామగుండం కార్పొరేషన్ఏరియా కాంగ్రెస్అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. బుధవారం ఏఐసీసీ మెంబర్, హిమాచల్ప్రదేశ్కు చెందిన అబ్జర్వర్ దీపక్రాథోడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష పదవి కోసం ఆశావహుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ లీడర్లు, పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగిన పాతపెల్లి రవికుమార్, కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, నెలకంటి రాము, సీనియర్ లీడర్లు కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.