
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, ఓటర్టెక్ తదితర కారణాల వల్ల ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలయవుతున్నాయి. నిన్న సూర్యాపేటలో ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా, తాజాగా గురువారం ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లాలో ట్రావెల్ బస్సు-ఆటో ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంల చిలకలూరిపేట అడ్డంరోడ్డు సెంటర్ దగ్గర చోటు చేసుకుంది. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు వాసులుగా గుర్తించారు. ప్రమాదం సంఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి