Reading Time: < 1 minute

LPG e-KYC: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: ఈ-కేవైసీ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Caption of Image.

డొమెస్టిక్ LPG సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గతంలో ఆగస్టు 23 నాటికి ఈకేవైసీ పూర్తి చేయటం మిస్ అయిన కస్టమర్లకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (e-KYC) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్ కంపెనీలు ఆగస్టు 31 వరకూ అవకాశం కల్పించాయి. 

ఆగస్టు 23తో ముగియాల్సిన ఎల్‌పీజీ ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించటంతో గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 82% మంది వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేశారు. గడువు ముగిసే సమయానికి రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోటెత్తడంతో గడువు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ALSO READ : పెళ్లి, పెత్తనంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక్కడ డొమెస్టిక్ యూజర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆగస్టు 31 తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతుంది. అయితే భవిష్యత్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం బెటర్ అని అధికారులు సూచిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.