
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, తనకంటూ ఓ సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా సందీప్ తాను నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమా సెన్సార్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే కచ్చితంగా ‘ఏ’ (A – Adults Only) సర్టిఫికెట్ ఉండాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకుల్లో ఒక ముద్ర పడిపోయింది. అయితే భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై తాను నిర్మించిన రోమాంచకం చిత్రానికి తొలిసారిగా ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ వచ్చిందని, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇదని ఆయన చెప్పారు. ఇదే క్రమంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెన్సార్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఫన్నీగా, తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. “నేను ఎంత క్లీన్గా తీయాలని ట్రై చేసినా.. సెన్సార్ వాళ్లు నాకు ‘ఏ’ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. స్పిరిట్ కు కూడా కచ్చితంగా ‘ఏ’ వస్తుంది” అంటూ నవ్వుతూనే చెప్పుకొచ్చారు. ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ భారతదేశం ‘స్పిరిట్’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, అందరికీ గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రిపోర్టర్లు కోరగా.. తప్పకుండా అందరూ సెలబ్రేట్ చేసుకునే అద్భుతమైన సినిమాను ఇస్తానని సందీప్ హామీ ఇచ్చారు.