
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న ‘‘కిరాణా హిల్స్’’పై దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, దీని గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్ను భారత్ పంపిన లోయిటరింగ్ మ్యూనిషన్(డ్రోన్) ఢీకొట్టిన విషయం నిజమే అని చెప్పారు. అయితే, కిరాణా హిల్స్ను ఉద్దేశపూర్వకంగా అటాక్ చేయలేదని చెప్పారు.
కిరాణా హిల్స్ ఢీకొట్టడానికి కారణం ఇదే..
రాడార్లను లక్ష్యంగా చేసుకుని పంపింని భారతీయ డ్రోన్, బహుశా ఇజ్రాయిల్ రూపొందించిన హారోప్ డ్రోన్ సర్గోధా చుట్టుపక్కల రాడార్ల కోసం గాలిస్తున్న క్రమంలో ఇంధనం అయిపోయినట్లు జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఇప్పటికే ఎయిర్ మార్షల్ ఏకే భారతి కిరాణా హిల్స్ టార్గెట్ జరగలేదని చెప్పారని, ఇప్పుడు తాను కూడా ఇదే వివరణ ఇవ్వగలనని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా దాడులకు ముందు సర్గోధా, కిరానా హిల్స్ ప్రాంతాల్లోకి అనేక లోయిటరింగ్ మ్యూనిషన్లను పంపినట్లు ఆయన చెప్పారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరానా హిల్స్ ఉన్నట్లు వివరించారు. నిర్దిష్టమైన ఆపరేషన్ కోసం సమయం ఉంటుందని, సుమారు రెండు గంటల పాటు గాలిస్తుంది, టార్గెట్ కనిపించకుంటే చివరకు ఎక్కడో చోట ఢీకొడుతుంది. ఇలా కిరాణా హిల్స్లోని కొండల్లో ఒక దాన్ని ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు.
స్కార్దుపై దాడికి అనుమతి, కానీ..
ఆక్రమిత కాశ్మీర్లోని స్కార్డుపై దాడి చేసేందుకు భారత వైమానిక దళానికి అనుమతి ఇచ్చినట్లు జనరల్ చౌహాన్ వెల్లడించారు. అయితే ప్రతికూల వాతావరణం కారనంగా ఆ దాడిని నిలిపేసినట్లు చెప్పారు. దీంతో భోలారిపై దాడి చేశామని చెప్పారు. మే 10న జరిగిన వైమానిక దాడుల్లో భోలారీలోని హ్యాంగర్లపై భారత వైమానిక దళం జరిపిన దాడి అత్యంత కీలకమైందిగా నిలిచింది. ఈ దాడిని గాంధీనగర్లోని సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నిర్వహించింది. భోలారిలో ఉన్న హ్యాంగర్లతో పాటు రన్వేపై పెద్ద గోతులు ఏర్పడటం అప్పట్లో వైరల్ అయ్యాయి.