
Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు వస్తే చాలు.. వెంటనే రెమ్యునరేషన్ను కోట్లలోకి పెంచేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తూ టాలీవుడ్, కోలీవుడ్లలో ఒక అరుదైన స్టేట్మెంట్ ఇచ్చింది స్టార్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. వరుస విజయాలతో క్రేజ్ పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి తన పారితోషికాన్ని పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రెమ్యునరేషన్ హైక్పై ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కేవలం హిట్లు వచ్చాయని రెమ్యునరేషన్ పెంచేయడం సరికాదు. నా పేరు చూసి థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే స్థాయి, అంతటి మార్కెట్ వాల్యూ నాకు వచ్చిన రోజే నా రెమ్యునరేషన్ పెంచుతాను” అంటూ స్పష్టం చేశారు.
సరికొత్త మైండ్సెట్తో ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. హిట్లు, క్రేజ్ వస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా ఇంత గ్రౌండెడ్గా ఉండటం నిజంగా అభినందనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన ‘మట్టి కుస్తీ’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘మట్టి కుస్తీ 2’ రిలీజ్కు రెడీ అవుతుంది. దీనితో పాటు, మెగా హీరో సాయి దుర్గ తేజ్ సరసన ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో ఐశ్వర్య లక్ష్మి రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.