Reading Time: < 1 minute
Kevin Pietersen Ipl Ecb Conflict Ended England Career

Kevin Pietersen: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. అభిమానులు సైతం మ్యాచులు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడం వెనుక ఐపీఎల్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పాల్గొనే విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)తో వచ్చిన విభేదాలే తన కెరీర్‌ను బలి తీసుకున్నాయని ఆరోపించాడు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో తనపై ఈసీబీ ఒక రకమైన ‘విచారణ’ (witch-hunt) జరిపిందని, మీడియాను ఉపయోగించుకుని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నాడు.

READ MORE: Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను ఈసీబీ అనుమతించలేదు. కేవలం డిమిత్రి మస్కరేనస్ మాత్రమే ఆ ఏడాది ఆడగలిగారు. 2009లో మూడు వారాల పరిమిత సమయం ఇచ్చినా, తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాధాన్యత ఇవ్వడం బోర్డుకు నచ్చలేదని పీటర్సన్ వెల్లడించాడు. “నేను పెద్ద త్యాగాలే చేశాను.. నా కెరీర్‌ను కోల్పోయాను. వ్యవస్థలోని వారంతా నాకు వ్యతిరేకం కావడానికి కారణం అదే. 33 ఏళ్ల వయసులో నా ఇంగ్లండ్ కెరీర్ ముగిసింది.” అని ఆవేదన వ్యక్తం చేశాడు. 104 టెస్టులు ఆడి 33 ఏళ్లకే కెరీర్ ముగించాల్సి వచ్చిందని, నిజానికి తాను 150-160 టెస్టులు ఆడి 12,000 నుంచి 13,000 పరుగులు సాధించాల్సిందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. “ఈసీబీ నాపై దాడి చేయడానికి ‘ది టెలిగ్రాఫ్’ను ఉపయోగించుకుంది. నేను దాని గురించి మరీ లోతుగా వెళ్లాలనుకోవడం లేదు. ఆ వార్తలు బాగా ప్రచారమయ్యాయి. పర్వాలేదు.. నేను ఇప్పుడు చాలా సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను.” అని పీటర్సన్ తెలపాడు. ఇక పీటర్సన్ కేరీర్ విషయానికి వస్తే.. తన టెస్ట్ కెరీర్‌ను 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో సహా 8,181 పరుగులు సాధించాడు.