
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఆ పోటీని తట్టుకుని నిలబడటం, కెరీర్ను గాడిలో పెట్టుకోవడం అంత సులభం కాదు. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde), ప్రస్తుతం కెరీర్ పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వరుస ప్లాపులు, ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోవడంతో ఈ భామ రేసులో వెనుకబడిపోయింది. ఇతర భాషల్లో స్పెషల్ సాంగ్స్, చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ఆమె నటించి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో, తన ఉనికిని చాటుకోవడానికి పూజా హెగ్డే ఇప్పుడు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
Also Read : Yadhu Vamsi: మలయాళం మూవీస్ మర్చిపోండి.. డైరెక్టర్ యదు వంశీ డేరింగ్ స్టేట్మెంట్..
తాజా సమాచారం ప్రకారం, యంగ్ హీరో శర్వానంద్, వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతున్న ‘జార్జ్ క్రిష్’ (George Krish) సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పూజా, ఈ క్రేజీ ప్రాజెక్ట్తో మళ్ళీ టాలీవుడ్లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. శర్వానంద్ కూడా ఈ సినిమా కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకుంటున్నారని, జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మొదటి షెడ్యూల్లోనే శర్వానంద్పై ఒక భారీ ఎంట్రీ సీన్ను చిత్రీకరించేందుకు దర్శకుడు శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, పూజా హెగ్డేకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. శ్రీను వైట్ల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కూడా చాలా ఫన్నీగా, బబ్లీగా ఉంటాయి. కాబట్టి, ఈ సినిమా హిట్టయితే పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ ‘జార్జ్ క్రిష్’ పూజా హెగ్డే కెరీర్కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.