Reading Time: < 1 minute
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌

నాసిరకం ఆహార పదార్థాలు, కల్తీ వస్తువుల వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటోందని భావించిన అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలోని గూడూరు గ్రామస్తులు ఒక కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకుండా ‘నో ఎంట్రీ’ బోర్డులు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా గ్రామంలోకి వస్తున్న ప్రైవేట్ ఐస్‌క్రీం బండ్ల ద్వారా అమ్ముతున్న ఐస్‌క్రీం తిని, పిల్లలు దంత మరియు జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామ పెద్దలు గుర్తించారు. ఆ ఐస్‌క్రీంలలో ఏ రకమైన రసాయనాలు, రంగులు కలుపుతున్నారో తెలియక పోవడంతో, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాటిని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించి ఐస్‌క్రీం అమ్మినా లేదా కొన్నా రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఊరి పొలిమేరల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేవలం ఐస్‌క్రీంలకే పరిమితం కాకుండా, ఈ గ్రామం గతంలో మద్యం బెల్ట్ షాపులను కూడా తొలగించి ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది. దురలవాట్లకు, కల్తీ ఆహారానికి చెక్ పెడితేనే తమ తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మి గిరిజన పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గూడూరు గ్రామస్తుల ఐక్యత, క్రమశిక్షణ చూసి అధికారులు సైతం అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు

Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా

గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా

బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం

దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి