Reading Time: < 1 minute

రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా

Caption of Image.

హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. బుద్వేల్‌లోని టీచర్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై టౌన్ ప్లానింగ్ విభాగం ఉక్కుపాదం మోపింది.

అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో… అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను గుర్తించి, జేసీబీలతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ… వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు ఈ  నిర్ణయం తీసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. నగరంలో అక్రమ నిర్మాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవని, భవన నిర్మాణాలకు ముందు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అనధికార నిర్మాణాలను అరికట్టేందుకు మున్ముందు కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.