అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడంతో గత వారం క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు మూడు రోజులుగా పసిడి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. తాజాగా మంగళవారం కూడా ఈ ధరలు మళ్లీ తగ్గాయి. కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.820 తగ్గాయి.
భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 24క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర ప్రస్తుతం రూ. 1,49,840 ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,50,650గా ఉంది అంటే జస్ట్ 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.800 వరకు తగ్గింది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,350 వద్ద ట్రేడువుతుంది.
ఇక ఆంధ్రప్రేదశ్లోని విజయవాడ, విశాఖ పట్నం, దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, పూణెలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆయా నగరాల్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.రూ. 1,49,840గా ఉండగా 22 క్యారెట్లు 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,350 వద్ద ట్రేడువుతుంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,49,990గా ఉండగా ఉదయం ఈ ధర రూ. 1,50,800గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,500 వద్ద కొనసాగుతుంది. అలాగే చెన్నైలో తులం బంగారం ధర రూ.1,51,200 వద్ద ట్రేడవుతుంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ ఆల్టైం హైకు చేరిన వెండి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. మంగళవారం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉండగా హైదరాబాద్లో ఈ ధర రూ.2,55,000వద్ద ట్రేడవుతుంది. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు ఈ రోజూ కేజీ వెండి ధర రూ.5000 తగ్గింది.




